ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4.41గంటలకు సచివాలయంలో మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేస్తారు. దాదాపు 13 వేల ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం.. పింఛన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం.. స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం చేస్తారు.