మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "పెద్దిరెడ్డి ఆరాచకాలన్నీ లెక్కపెడుతున్నాం.. ప్రతిదాన్ని సెటిల్ చేస్తాం. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భూ దోపిడీకి పాల్పడుతున్నారు. పెద్దిరెడ్డి దోపిడీలను ప్రశ్నించొద్దా.. చూస్తూ ఉరుకోవాలా? అంగళ్లు ఘటనలో నాతో పాటు 600 మంది
టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారు." అని అంగళ్లు సభలో చంద్రబాబు మండిపడ్డారు.