AP: రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరగడం చూస్తే టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ పాలనపై వ్యతిరేకత కారణంగానే ఓటర్లు ఓటుతో కసి తీర్చుకున్నారని చెప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై నమ్మకంతోనే ఓటింగ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాలుగోసారి సీఎం అవుతున్నారని జోస్యం చెప్పారు. అమరావతిలోనే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొన్నారు.