అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోన్న వేళ.. దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం చంద్రబాబు అయోధ్యకు వెళ్లనునున్నారు.