ఏపీ సీఎం జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ తరుపున వాదిస్తున్న లాయర్ సలీం మిస్సింగ్ కలకలం రేపుతోంది. గురువారం రాత్రి నుంచి ఆయన అదృశ్యం అయ్యారని అతడి భార్య, కొడుకు ఆందోళన చెందుతున్నారు. కేసు తీసుకున్నప్పటి నుంచి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పోలీసులు తన భర్తను ఏదైనా చేస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.