కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో విషాదం చోటు చేసుకుంది. ఆరేపల్లి వాగ్దేవి (8) నిన్న రాత్రి స్థానిక చెరువులో మునిగి గల్లంతైంది. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బుధవారం మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.