పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్కు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మే 5వ తేదీన పిఠాపురంలో చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తారని టాక్. కాగా, కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్లను గెలిపించాలని ఓటర్లకు చిరంజీవి విజ్ఙప్తి చేసిన సంగతి తెలిసిందే.