డంపింగ్ యార్డులో అదుపులోకి వచ్చిన మంటలు:కమిషనర్

51చూసినవారు
చిత్తూరు నగరపాలక ఓబనపల్లి డంపింగ్ యార్డులో మంటలు అదుపులోకి వచ్చాయి. నగరపాలక, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నగర కమిషనర్ డా. జె అరుణ మంగళవారం ఉదయం వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లెనిన్ నగర్ లోని 20 కుటుంబాలను అంగన్వాడీ కేంద్రానికి తరలించారు. పొగ వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్లి మాస్కులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్