అమెరికాలో మరో భారతీయ విద్యార్థి జీవితం విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అరాఫత్ మృతదేహాన్ని పోలీసులు కనుగోన్నారని భారత్ ఎంబసీ ట్వీట్ చేసింది. తమ కుమారుడిని డ్రగ్స్ మాఫియానే హత్య చేసిందని అరాఫత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.