చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ-1 విజయేంద్రరావుకు డీడీగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కేజీబీవీ ఉప సంచాలకులుగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో పుత్తూరు, మదనపల్లె, తిరుపతిలో ఉప విద్యా శాఖాధికారిగా పనిచేశారు. గతంలో ఉమ్మడి జిల్లా డిఈఓగా పనిచేశారు.