రేపు వారికి బదిలీల కౌన్సిలింగ్: కమిషనర్

51చూసినవారు
రేపు వారికి బదిలీల కౌన్సిలింగ్: కమిషనర్
చిత్తూరు జిల్లా పరిధిలోని పుర, నగర పాలకల్లోని వార్డు సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో జరుగుతుందని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వార్డు కార్యదర్శులు ఉదయం ఎనిమిది గంటలకు కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్నారు. కౌన్సిలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్