కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన చక్రవర్తి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.