చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండల కేంద్రంలో వెలసిన బంగారమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవతామూర్తిని వైభవంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పూజల్లో పాల్గొన్నారు.