వెదురుకుప్పం మండలం, పాతగుంటలో దొంగలు ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్ బైక్ చోరీకి గురైంది. వారం రోజులుగా ద్విచక్ర వాహనాలు మండలంలో తరచు చోరీకి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను విడుదల చేశారు. మండలంలో పోలీసు గస్తీ సక్రమంగా లేకపోవడం వల్ల చోరీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు