అనంతపురం రేంజ్ సీ. సీ. ఎఫ్ నాగేశ్వర రావు, చిత్తూరు డీ. ఎఫ్. ఓ చైతన్య కుమార్ లు మంగళవారం రామకుప్పం మండలం ననియాల నందు ఏనుగుల కదలికలను పరిశీలించి, కొత్తగా వేసిన జంగిల్ సఫారి రోడ్డును, ననీయాల నర్సరీ తనిఖీ చేశారు. ననియాల పార్కు అభివృద్ది చేయుటకు ప్రణాలికలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. కుప్పం రేంజర్ జయశంకర్ మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.