ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రావలసిన గౌరవ వేతనం చెల్లించాలని నియోజకవర్గ సెక్టార్లు, రూట్ ఆఫీసర్లు, ఎఫ్ఎస్టీ టీమ్ మెంబర్లు ఎన్నికల అధికారి అయిన తహసీల్దార్కు గురువారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ జిల్లా అధికారులతో చర్చించి రూ. 10 వేలు చెల్లిస్తామని తెలిపారు. దీనిపై ఎన్నికలకు పనిచేసిన సిబ్బంది మాట్లాడుతూ తమకు త్వరగా డబ్బులు చెల్లించి న్యాయం చెయ్యాలన్నారు.