నంది వాహనంపై దర్శనమిచ్చిన వినాయక స్వామి

69చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి నుండి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అధికార నంది వాహనంపై బుద్ధి సిద్ధి సమేత వరసిద్ధుడు ఊరేగారు. ఈ కార్య క్రమానికి ఉభయదారులుగా కాణిపాకంకు చెందిన ఒళ్ళువర్ వంశస్థులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి మోహన్, ఈవో గురు ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్