పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగుపల్లి లో వెలసిన బోయకొండ
గంగమ్మ ఆలయ ఛైర్మన్ పదవిని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి గంగరాజుకు కేటాయించాలని సోమవారం బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకులకే చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామన్నారు.