బంగారు తిరుచ్చిపై శ్రీ పద్మావతి అమ్మవారు

52చూసినవారు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం విశేషాలంకరణలో నాలుగు మాడ వీధుల్లో విహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్