వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగింపు : జిల్లా కలెక్టర్

66చూసినవారు
వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగింపు : జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12న జీవో యం. యస్ నెం. 82 ను జారీ చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్య సేవలు అందుతాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్