రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

78చూసినవారు
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనాన్ని టమోటా లోడుతో వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. కర్నాటక రాష్ట్రం ఉడిపి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 13న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందిన సంగతి తెల్సిందే.

సంబంధిత పోస్ట్