తమిళనాడు టు కర్నాటక వయా కుప్పం.. బియ్యం అక్రమ రవాణా

75చూసినవారు
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కుప్పం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. మంగళవారం కంటైనర్ లో తమిళనాడు నుండి కుప్పం మీదుగా కర్నాటకకు తరలిస్తున్న వాహనం టైర్ పంచర్ కావడంతో విషయం బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కంటైనర్ వానియంబాడి కి చెందిన బియ్యం స్మగ్లర్ శరత్ కు చెందినదిగా సమాచారం. పట్టపగలే కుప్పం మీదుగా అక్రమ రవాణా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది.

సంబంధిత పోస్ట్