మదనపల్లెలో శుక్రవారం కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలోని వెలగపూడిలో మదనపల్లె కూటమి ఎమ్మెల్యే షాజహాన్ బాష ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అనంతరం స్థానిక బెంగళూరు బస్టాండులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నేతలు టపాసులు కాల్చి, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో షంషీర్, మస్తాన్, పూల కుంట హరి, బాబా తదితరులు పాల్గొన్నారు.