మదనపల్లెలో కేంద్ర బలగాలతో కవాతు

58చూసినవారు
ఓట్ల లెక్కింపు సందర్భంగా గొడవలు జరగకుండా ముందస్తుగా బుధవారం మదనపల్లెలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో సీఐలు యువరాజు, వల్లీ బాషా, శేఖర్, సద్గురుడు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో పట్టణ వీధుల్లో కవాతు నిర్వహించినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్