కారు ఢీకొని పాలడైరీ ఉద్యోగికి తీవ్ర గాయాలు

62చూసినవారు
కారు ఢీకొని పాలడైరీ ఉద్యోగికి తీవ్ర గాయాలు
రోడ్డు పక్కన నిలబడి ఉన్న పాలడైరీ ఉద్యోగిని కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డట్లు మదనపల్లె సీఐ శేఖర్ తెలిపారు. మదనపల్లె మండలం నక్కలదిన్నె వద్ద ఉంటున్న అమూల్ పాల డైరీలో పనిచేసే రామ్మోహన్ శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డు పక్కన నిలబడ్డాడు. అదే సమయంలో బెంగళూరు వైపు నుంచి మదనపల్లెకు వస్తున్న కారు రామ్మోహన్ ను ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్