మదనపల్లె పట్టణం నందు నిన్న జరిగిన సిద్ధం సభను ప్రజలు విజయవంతం చేశారని వైయస్సార్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. బుధవారం పట్టణంలోని వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ ని చూసేందుకు ప్రజలు సునామీలా తరలివచ్చారన్నారు. ఇది చూసి ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు.