స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నగరి, వెదురుకుప్పం, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు తొమ్మిది రోజుల పాటు టీచ్ టూల్పై అందించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగింపుకు చేరుకుంది. కోర్సుడైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన మెరుగుపరచుటకు, విద్యార్థులకు అనుగుణంగా బోధించడానికి ఇప్పటివరకు అందించిన శిక్షణ దోహదపడుతుందన్నారు.