వైసీపీని విడుతారన్న ప్రచారం పై స్పందించిన ఆర్కే రోజా..

67చూసినవారు
వైసీపీని విడుతారన్న ప్రచారం పై స్పందించిన ఆర్కే రోజా..
ఏపీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమిళనాట రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే టాక్‌ నడుస్తుంది. దీనిపై తాజాగా రోజా స్పందించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అదంతా ఊహగానమే అని రోజా తెలిపారు. తాను ఏ పార్టీ మారడం లేదని రోజా స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్