గంగవరం మండలంలోని కల్లుపల్లి పంచాయతీ బూడిదపల్లె అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందింది. అడవి సమీపంలోని పంట పొలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒంటరి ఏనుగు కరెంటు వైర్లలో చిక్కుకొని మరణించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు.