లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద 102 స్థానాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ పూర్తికానుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.