త్వరలో పలమనేరు జాతరపై నిర్ణయం..?

1054చూసినవారు
పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ రెడ్డి గురువారం నామినేషన్ రూల్స్ వివరించారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థితో పాటు నలుగురు మాత్రమే ఉండాలని కోరారు. మూడు వాహనాలకే అనుమతి ఇస్తామన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్ ను అనుసరించి నడుచుకోవాలన్నారు. పోలింగ్ రోజున పలమనేరులో గంగ జాతర ఉందని, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్