పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆరవ రోజు మరో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ రెండు నామినేషన్లు వేయగా, ఆయన సతీమణి ఉష ఓ సెట్ నామినేషన్ వేశారన్నారు. దీంతో పలమనేరులో మొత్తం ఇప్పటివరకు నామినేషన్ల సంఖ్య 21కి చేరిందన్నారు.