బిహార్‌లో జేడీయూ నేత దారుణ హత్య

71చూసినవారు
బిహార్‌లో జేడీయూ నేత దారుణ హత్య
జనతాదళ్-యునైటెడ్ (JDU) నాయకుడు సౌరభ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాట్నాలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా గతరాత్రి పర్సా బజార్ గ్రామంలో నలుగురు దుండగులు సౌరభ్ తలపై రెండుసార్లు కాల్పులు జరిపారు. దీంతో సౌరభ్ మృతిచెందాడు. సౌరభ్‌తో పాటు ఉన్న మున్ముమ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్