కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారికి వైభవంగా ఆలయ మాడా వీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేశు, డి వై ఈ ఓ వాణి, ఆలయ ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్ స్పెక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.