జేసీ కుటుంబానికి చంద్రబాబు షాక్

2587చూసినవారు
జేసీ కుటుంబానికి చంద్రబాబు షాక్
జేసీ కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. వారి ఫ్యామిలీకి కేవలం ఒక టికెట్ మాత్రమే కేటాయించారు. అనంతపురం ఎంపీ టికెట్‌ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఆశించారు. తాజాగా విడుదలైన లిస్ట్‌లో ఆ టికెట్‌ను అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. దాంతో గుంతకల్, కల్యాణదుర్గంలో ఏదో ఒక స్థానంలో టికెట్ ఇవ్వాలని పవన్ కోరుతున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ దక్కింది.

సంబంధిత పోస్ట్