ఉత్తరప్రదేశ్లోని మధురలో గురువారం దారుణం జరిగింది. అక్కడ ఓ గ్రామానికి చెందిన విజయ్కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని భార్య తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కొద్ది రోజులు కూతురిని ఇంటికి పిలిపించారు. అనంతరం ఇరువర్గాలు భార్యాభర్తలను కలపడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ అల్లుడితో గొడవ జరగడంతో అత్తమామలు అల్లుడిని సజీవ దహనం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.