జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పట్టణం

72చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం ఆదివారం జైశ్రీరామ్ నినాదాలతో మారు మోగింది. హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ పేట నూతన అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. గోకుల్ సర్కిల్లోకి వందల కొలది యువత పాల్గొని భరతమాత, చత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్