పట్టణంలో 13 లక్షల విలువైన టపాసులు స్వాధీనం

61చూసినవారు
పట్టణంలో 13 లక్షల విలువైన టపాసులు స్వాధీనం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన టపాసుల గోడౌన్లపై పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 13 లక్షల విలువచేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నగిరివీధి, తాటిమాకులపాళెం, తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచారన్న సమాచారం రావడంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్