పుంగనూరు చిన్నారి అస్పియా మృతిపై వీడిన మిస్టరీ

73చూసినవారు
పుంగనూరు చిన్నారి  అస్పియా మృతిపై వీడిన మిస్టరీ
పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్ఫియా మృతి హత్యేనని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. అస్ఫియా తండ్రి తన ఇంటికి సమీపంలోని ఓ మహిళకు రూ. 3.60 లక్షలు అప్పు ఇచ్చాడు.అప్పును తిరిగి ఇవ్వలేదని చిన్నారి తండ్రి ఆమెను దూషించాడు.దీంతో పగ పెంచుకున్న సదరు మహిళ అస్ఫియాను ప్లాన్ గా తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది.ఆ తర్వాత చంపేసి బైకుపై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేసింది.

సంబంధిత పోస్ట్