శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వరాలయంలో పౌర్ణమి పూజలు
: పుత్తూరు పట్టణంలోని కార్వేటినగరం రోడ్డు నందు వెలసి ఉండు శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర ఆలయంలో ఆలయంలో మంగళవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సదాశివేశ్వరున్ని ఆలయం చుట్టూ ఊరేగించారు. తదుపరి పౌర్ణమికి గిరి ప్రదర్శన ఏర్పాట్లు చేస్తామని ఆలయ చైర్మన్ కొడగంటి రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు.