ఇసుక రవాణాను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

1872చూసినవారు
నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండిగ వద్ద అరుణానది ఇసుక రీచ్లో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను బిఎస్పీ నాయకులు ధన ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. నాగలాపురం తహశీల్దారు, ఎంపీడీవో, పోలీసులకు బీఎస్పీ నాయకులు సమాచారం అందించారు. అధికారులు వెళ్లి వాహనాలను ఆపి వారితో చర్చించారు. ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్