ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని సిటీ సెంటర్ మాల్లో తాజాగా విషాద ఘటన జరిగింది. మాల్లోని ఏడాది వయసు ఉన్న బాలుడిని తండ్రి ఎత్తుకున్నాడు. మూడో అంతస్తులో ఎస్కలేటర్ ఎక్కేందుకు యత్నించాడు. ఆ సమయంలో తండ్రి చేతుల్లో నుంచి బాలుడు జారి కింద పడ్డాడు. మూడో అంతస్తు నుంచి పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.