బాలికను వేధించిన ఘటనలో యువకులను రిమాండ్ కు తరలింపు

66చూసినవారు
బాలికను వేధించిన ఘటనలో యువకులను రిమాండ్ కు తరలింపు
శ్రీరంగరాజపురం మండలానికి చెందిన బాలిక(14) వెదురుకుప్పం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెను వేధిస్తుండడంతో పాఠశాలకు వెళ్లడం మానేసింది. తల్లిదండ్రులు ఆరా తీయగా వేధిస్తున్న విషయం చెప్పడంతో ఆమె తండ్రి యువకులను నిలదీయగా ఆయన పై కూడా రాడ్డు తో దాడి చేసి గాయపరిచారు. గాయపడిన బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు యువకుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్