సత్యవేడు పట్టణంలోని అగ్రహారం చెరువు కట్ట సమీపంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి హరి ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ఇతను తమిళనాడులోని పొన్నేరి సత్యవేడులోని ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. శనివారంసంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరాంజనేయులు మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.