రెబల్స్ అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం భారీ షాకిచ్చింది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసినా వెనక్కి తగ్గని నేతలపై వేటు వేసింది. మీసాల గీత (విజయనగరం), అబ్రహం (అరకు), సూర్యచంద్రరావు (పోలవరం), రాజశేఖర్ (సత్యవేడు), శ్యామ్ కుమార్ (అమలాపురం) తదితర నేతలను సస్పెండ్ చేసింది. టీడీపీ వీరికి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దాంతో అధిష్టానం వీరిపై చర్యలు తీసుకుంది.