తెలంగాణ పదో తరగతి 2024 పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. విద్యార్ధులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.