వరదయ్యపాళ్యం: కాలువలా మారిన రోడ్డు

81చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళ్యం మండలం పాండూరు నుంచి తొండమబట్టు, ఎంజీ నగర్, సిద్దాపురం రేపల్లెవాడ హెచ్ డబ్ల్యూ మీదుగా వెళ్లే రోడ్డు గతేడాది వర్షాలకు కొట్టుకెళ్లింది. ఏడాది అవుతున్నా మరమ్మత్తు పనులు చేయలేదని శుక్రవారం స్థానికులు తెలిపారు. రోడ్డు కాలువలా మారిందని ఇప్పటికైనా అధికారులు బాగు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్