వారాహి ఆషాడ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

63చూసినవారు
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర ఆలయంలో శ్రీవారాహి ఆషాడ నవరాత్రి ఉత్సవాలు శనివారం సాయంత్రం ప్రారంభమైంది. వారాహి అమ్మవారికి పంచామృతంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు 300 రూపాయల రుసుము చెల్లించి టికెట్టు పొంది అభిషేక పూజలో పాల్గొన్నారు. పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసులు పూజలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్