సచివాలయ ఉద్యోగుల సంఘం 69/21 నూతన కార్యవర్గం ఏర్పాటు

2902చూసినవారు
సచివాలయ ఉద్యోగుల సంఘం 69/21 నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (డెమొక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ) గ్రామ సచివాలయం ఉద్యోగుల సంఘం 69/21 బలోపేతంలో భాగంగా సంఘ వ్యవస్థాపకులు పి శామ్యూల్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ నూతన కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి జోసెఫ్ కిషోర్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా అసోసియేషన్ ఫౌండర్ పి సామ్యూల్ , రాష్ట్ర కార్యదర్శి జోసెఫ్ కిషోర్ లు ఆదివారం మాట్లాడుతూ గ్రామ సచివాలయ సంఘాన్ని ఏర్పాటు చేసి రెండేళ్ళు పూర్తయిందని అన్నారు. ఈ రెండేళ్లలో సంఘం అభివృద్ధికీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేరు. సంఘం మరింత బలోపేతం చేయడంలో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి మరి ముందుకు వెళుతున్నామని అన్నారు.

ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కమిటీ అధ్యక్షులుగా చాంద్ బాద్షా, కార్యదర్శిగా జి గిరి బాబు, ఉపాధ్యలుగా కే సౌమ్య సహాయ కార్యదర్శిగా కే విజయ లక్ష్మి, మూడే రోజా కార్యనిర్వాహక అధ్యక్షులుగా లక్ష్మి నారాయణ, జయచంద్ర నాయుడు, ఈసీ మెంబర్లుగా దుర్గ పార్వతి, యశోద, బి అపర్ణ, ప్రేమ్ కుమార్ ,యస్వంత్, భరత్ ,మునిస్వామి సిద్దు, ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్, బి రాజు నియమించడం జరిగిందని తెలిపారు. మీకు ఇచ్చే ఈ పదవులను ఒక అలంకరణగా కాకుండా సంఘ అభివృద్ధికీ కృషి చేయాలనీ నూతన సంఘ సభ్యులకు సూచించారు.

నూతన అధ్యక్షులు చాంద్ బాద్షా, జిల్లా కార్యదర్శి జి గిరి బాబు మాట్లాడుతూ తమపై నమ్మకంతో సంఘం నూతన అధ్యక్షులు, కార్యదర్సులుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమకి ఇచ్చిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేస్తామని అలాగే పాత కార్యవర్గ సభ్యుల సహాయాసహకారాలు ముఖ్యంగా వారి అమూల్యమైన సూచనలు సలహాలతో సంఘం అభివృద్ధికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాజా కుమార్ పాల్గొన్నారు, జిల్లా అధ్యక్షులు బి చాంద్ బాద్షా మరియు కార్యదర్శి జి గిరి బాబును ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్