వెంటనే పెండింగ్ జీతాలను చెల్లించాలి: నవీన్ కుమార్ రెడ్డి

68చూసినవారు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల పరిస్థితి దినదిన గండంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్న సుమారు 3,500మంది ఉద్యోగస్తుల ఖాతాల్లో సగం నెల పూర్తవుతున్నా జీతాలు పడకపోవడంతో వారి జీవనం ప్రశ్నార్థకంగా మారాయన్నారు. వెంటనే పెండింగ్ జీతాలను చెల్లించాలని నవీన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్